స్వామీజీ మీరైనా చెప్పండి: చినజీయర్‌ కు ఆర్టీసీ కార్మికుల వినతి

స్వామీజీ మీరైనా చెప్పండి: చినజీయర్‌ కు ఆర్టీసీ కార్మికుల వినతి

చినజీయర్ స్వామిజీని ఆర్టీసీ కార్మికులు కలిశారు. తాము పడుతున్న కష్టాలను…చేస్తున్న సమ్మెను స్వామీజీకి తెలిపారు. ఆయన కూడా వారి సమస్యలను సానుకూలంగా విన్నారు.

గత 26 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఇవాళ(బుధవారం) చినజీయర్‌ స్వామిజీని కలిశారు. రాజేంద్రనగర్‌, మహేశ్వరం ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు ముచ్చింతల్‌ లోని ఆయన ఆశ్రమానికి వెళ్లి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ  డిమాండ్లు న్యాయమైనవైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను పట్టించుకుని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కార్మికుల సమస్యలను విన్న స్వామీజీ సానుకూలంగా స్పందించారు. ఇందులో ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.