
నువ్వు దొరవైతే నేను దొరసాని.. తగలబెడతా’ అంటోంది మమతా మోహన్దాస్. అజయ్ సామ్రాట్ డైరెక్షన్లో ‘రుద్రంగి’ అనే మూవీ చేస్తోందామె. అందులోని డైలాగే ఇది. జగపతిబాబు, విమలా రామన్, ఆశిష్ గాంధీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దొరసాని జ్వాలాబాయిగా నటిస్తోంది మమత. నిన్న ఆమె ఫస్ట్ లుక్ని రివీల్ చేశారు. ఓ పెద్ద కోటలో హుందాగా కూర్చుని ఉందామె. కాగడాల వెలుగులో మెరిసిపోతోంది. నిలువెల్లా రాజసం ఉట్టిపడుతోంది. బోలెడంత గాంభీర్యం, కాసింత కాఠిన్యం కలగలిసిన శక్తివంతమైన మహిళలా కనిపిస్తోంది.
రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. బిజీ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో మమత కెరీర్కి క్యాన్సర్ అడ్డుపడింది. కోలుకున్న తర్వాత మళ్లీ బిజీ అయ్యిందామె. పోయినేడు ఆమె నటించిన ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఈ యేడు ‘జనగణమణ’ రిలీజయ్యింది. మరో ఐదు సినిమాల వర్క్ జరుగుతోంది. వాటిలో ‘రుద్రంగి’ ఒకటి. టైటిల్ రోల్ పోషిస్తోంది కనుక ఈ సినిమా మమత కెరీర్కి మరింత ప్లస్ అయ్యే చాన్స్ ఉందనిపిస్తోంది.