
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదోన్నతులు రాకుండా మిగిలిపోయిన భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలని ఆర్యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింహులు డిమాండ్ చేశారు. ఆదివారం ఎంపీ మల్లు రవిని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశియాదవ్ తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.
అంతకు ముందు గాంధీభవన్ ఆవరణలోని సర్వోదయ సమితి ఆఫీసులో ఆర్యూపీపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దీంట్లో సంఘం పూర్తిస్థాయి కార్యవర్గం వేయాలని, సంఘ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో నేతలు విజయ్ కుమార్, లెంకల రాంరెడ్డి, గోపాల్, సుధాకరాచారి, వెంకటస్వామి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.