ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగారైతులను బీఆర్ఎస్ రెచ్చగొడ్తున్నది : సంపత్ కుమార్

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగారైతులను బీఆర్ఎస్ రెచ్చగొడ్తున్నది : సంపత్ కుమార్
  • గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది: సంపత్ కుమార్

హైదరాబాద్, వెలుగు: గద్వాల్ జిల్లాలో ఏర్పాటుచేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు రెచ్చగొడ్తు న్నారని, ఇటీవల వారే ముందుండి ధర్నా చేయించారని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే హరీశ్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2004లో కాంగ్రెస్ భిక్షపెడితే ఏడాదిన్నర పాటు మంత్రిగా హరీశ్‌‌‌‌ పనిచేశారని గుర్తుచేశారు. ఇథనాల్ కంపెనీకి రావాల్సిన 9 పర్మిషన్లు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలే ఇచ్చాయని సంపత్ కుమార్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.