శబరిమలలో అయ్యప్ప ప్రసాదానికి ఎలాంటి కొరత లేదు కానీ ఆ ప్రసాదాన్ని నింపై డబ్బాలలోనే కొరత ఏర్పడింది. దీంతో ఒక భక్తుడికి కేవలం 2 టిన్నులే అందిస్తామని దేవస్థానం బోర్డు పేర్కొంది. అంతకుముందు పది టిన్నులు మాత్రమే అందించింది. శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం, మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో అరవణ ప్రసాదంపై పరిమితులు విధించింది దేవస్థానం బోర్డు. ఈ నిర్ణయంతో పొరగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కచ్చితంగా రెండు టిన్నులు సరిపోవు.. ఒకదాన్ని అక్కడే తింటారు. మరోకటి ఇంటికి తీసుకువెళ్తారు. బంధువులు, చుట్టుపక్కల వారికి ఇవ్వడానికి కష్టం అవుతుంది.
ఎందుకింత కొరత ఏర్పడిందంటే.. శబరిమలకు ఈ ఏడాది భక్తుల తాకిడి బాగా పెరిగింది. భారీ క్యూలైన్లు ఉన్నాయి. సంక్రాంతి మకరజ్యోతి వరకు ఆ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అందులో సందేహం అక్కర్లేదు. దీంతో డబ్బాల వాడకం పెరగింది. ఈ క్రమంలో అందిరికీ ప్రసాదం అందేలా దేవస్థానం బోర్డు ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందించాలని నిర్ణయించింది. గతేడాది 26వ తేదీన 2 కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్ట్ను ఇచ్చింది దేవస్థానం బోర్డు. అయితే అంత మొత్తంలో కంపెనీలో అరవణ ప్రసాదం డబ్బాలను అందించలేకపోయాయి. ఇది డబ్బాల కొరత ఏర్పడటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని బోర్డు వెల్లడించింది.