పాఠశాలల్లో పిల్లల కోసం సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేయాలి : మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి

పాఠశాలల్లో పిల్లల కోసం సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేయాలి :  మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి

హైదరాబాద్ : పిల్లలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. నిజాంపేట్ లోని సంఘమిత్ర స్కూల్ లో ‘స్కూల్ సేఫ్టీ క్లబ్’ పేరిట విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వాలంటరీ గ్రూప్ ను డీసీపీ శిల్పవల్లి ప్రారంభించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీపీ ఆదేశాల మేరకు కమిషనరేట్ వ్యాప్తంగా ‘స్కూల్ సేఫ్టీ క్లబ్’ ను పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  

ఫిజికల్, సైబర్, యాంటీ డ్రగ్స్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారని డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. విద్యార్థులలో మనోధైర్యాన్ని నింపుతూ.. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచేలా చూడాలన్నారు. సంఘమిత్ర స్కూల్ మాదిరిగా ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల కోసం సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు.