దేవుడికి హార‌తి ఎలా ఇస్తారు.. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ పై విమ‌ర్శలు

 దేవుడికి హార‌తి ఎలా ఇస్తారు.. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ పై విమ‌ర్శలు

మెగా హీరో సాయిధరమ్ తేజ్ వివాదాల్లో చిక్కుకున్నారు.  2023 జూలై 14న తేజ్ ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు . అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అక్కడ సుబ్రమణ్యస్వామివారికి తానే స్వయంగా హారతి ఇచ్చారు. ఇదే వివాదానికి దారి తీసింది.  ఆలయ నియమాల ప్రకారం  స్వామివారికి  ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని భక్తులు మండిపడుతున్నారు. 

భక్తులు నేరుగా దేవుడికి హారతులివ్వడం విరుద్ధమని మండిపడుతున్నారు. ఆలయ నియమాలకు విరుద్దంగా సాయి ధరమ్ తేజ్ చేత హారతిని ఇప్పించారంటూ ఆలయ అధికారులపై  భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై సాయిధరమ్ తేజ్ ఇంతవరకు స్పందించలేదు.  

యాక్సిడెంట్ తరువాత కోలుకున్న హీరో సాయిధరమ్ తేజ్..  విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్ అయింది.  ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా కడపలో దర్గా, కాణిపాకంలో విఘ్నేశ్వరుడు, శ్రీకాళహస్తిలో శివుడ్ని దర్శించుకున్నాడు సాయి ధరమ్ తేజ.