ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను మోసం చేశారని సామా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన తమ భూమిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమ భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నారని వెల్లడించారు. 2016 లో కొంపల్లిలో తనకు భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తానని నమ్మించి శంకర్ పల్లిలోని పలు సర్వే నెంబర్లు గల 113 ఎకరాల తన స్థలాన్ని మోసపూరితంగా అతని పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. దీంతోపాటు మరో 65 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.
ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెబితే .. వివాదాలు లేకుండా చూసుకోవాలని జీవన్ రెడ్డిని హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని చెప్పారు. కేసీఆర్ తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్మూరు ఎమ్మెల్యేజీవన్ రెడ్డిపై ఈడీ చీఫ్ సెక్రటరీ,కమిషనర్, సీపీలకు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ ,కేటీఆర్ స్పందించకపోతే త్వరలోనే గవర్నర్ ను కూడా కలిసి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు.