శామ్ సంగ్ నుంచి 64 ఎంపీ కెమెరా ఫోన్

శామ్ సంగ్ నుంచి 64 ఎంపీ కెమెరా ఫోన్

హై ఎండ్​ ఫోన్లలో యాపిల్,  గూగుల్​ పిక్సెల్​లు బెస్ట్​ కెమెరాతో ఆకట్టుకుంటున్నాయి. ఈ విషయంలో సామ్​సంగ్​ వాటికి పోటీ ఇవ్వలేకపోతోంది. అందుకే త్వరలో వాటికి మించిన కెమెరాతో కొత్త మొబైల్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అది కూడా 64 ఎంపీ కెమెరాకు సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే చాలా ఫోన్లలో ‘48 ఎంపీ ఐసోసెల్’ కెమెరాలొచ్చాయి. స్మార్ట్​ఫోన్​ యూజర్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటిని సోషల్​ మీడియాలో పోస్ట్​  చేస్తున్నారు. అందుకే వినియోగదారులు మంచి కెమెరా ఉన్న ఫోన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బెస్ట్​ కెమెరా ఉన్న లేటెస్ట్​ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. యాపిల్, గూగుల్​ పిక్సెల్‌తోపాటు వివో, ఒప్పో, రెడ్​మి వంటి బ్రాండ్లు మంచి కెమెరా ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఫలితంగా సామ్​సంగ్​ మార్కెట్​ తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సామసంగ్​ కెమెరా ఫీచర్​పై దృష్టి సారించింది.

64 ఎంపీ కెమెరా

సరికొత్త 64 ఎంపీ ఐసోసెల్​ బ్రైట్​ జీడబ్ల్యూ1 కెమెరాను సామ్​సంగ్​ రూపొందిస్తోంది. ప్రత్యేక అల్గారిథమ్​ను ఉపయోగించుకుని ఈ కెమెరా 48 ఎంపీ సెన్సర్లకంటే మరింత స్పష్టమైన ఇమేజెస్​ను క్యాప్చర్​ చేస్తుంది.  జీడబ్ల్యూ1 సెన్సర్లు హెచ్​డిఆర్​ను సపోర్ట్​ చేస్తాయి. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ టెక్నాలజీ సక్సైస్​ అయితే, పూర్తి స్థాయిలో ఫోన్లలో అందుబాటులోకి వస్తుంది.