- సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ
సికింద్రాబాద్, వెలుగు : సనత్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ఆదివారం విజయభేరి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమీర్పేట్ సత్యం థియేటర్ నుంచి బేగంపేట్ మీదుగా బన్సీలాల్పేట్వరకు కొనసాగింది. బేగంపేట్ చౌరస్తాలోని ప్రకాష్ నగర్ వద్ద వివిధ పార్టీల నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా కోటా నీలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ మీద నమ్మకంతోనే ప్రజలు చేరుతున్నారని ప్రకటించారు. అధికార పార్టీ నేతల అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదన్నారు.