Virat Kohli: టెస్ట్ ఫార్మాట్ వదిలేసి వన్డే క్రికెట్ ఎంచుకున్నాడు.. కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు

Virat Kohli: టెస్ట్ ఫార్మాట్ వదిలేసి వన్డే క్రికెట్ ఎంచుకున్నాడు.. కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు

క్రికెట్ లో దశాబ్దం కలం పాటు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ ఫ్యాబ్-4గా ఈ లిస్ట్ లో ఉన్నారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్ లో తగ్గేదే లేదన్నట్టు అదరగొట్టారు.కోహ్లీ సంగతి పక్కన పెడితే రూట్, విలియంసన్, స్మిత్ టెస్ట్ క్రికెట్ లో సత్తా చాటుతున్నారు. మిగిలిన ఫార్మాట్ లలో వీరు తమ నిలకడ కోల్పోయినా సుదీర్ఘ ఫార్మాట్ లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా రూట్ ఇటీవలే ఆస్ట్రేలియాపై యాషెస్ లో సెంచరీతో 41 శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా నిరాశకు గురి చేసిందని అన్నాడు.  

సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. "జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను చేరుకుంటున్నాడు. మరోవైపు నా మనసు విరాట్ కోహ్లీ వైపు వెళ్తుంది. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ కు ముందు ఐదు సంవత్సరాలు టెస్టుల్లో పెద్దగా రాణించలేదు. కేవలం 31 యావరేజ్ తో పరుగులు చేశాడు. రెండు రకాల ఫార్మాట్ లకు రిటైర్మెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేలు మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ లో ఈజీ ఫార్మాట్ ను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ విషయం నాకు అసంతృప్తిని కలిగిస్తోంది". అని మంజ్రేకర్ సోషల్ మీడియాలో అన్నారు.

లేటెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రూట్, విలియంసన్, స్టీవ్ స్మిత్ టాప్ -5 లో ఉన్నారు. రూట్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కేన్ విలియంసన్ ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో రాణిస్తున్న స్మిత్ ఐదో స్థానంలో నిలిచాడు. ఫ్యాబ్-4 లో ముగ్గురు క్రికెటర్లు టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్-5 లో ఉన్నారు. ఈ లిస్ట్ లో కోహ్లీ లేకపోవడం సంజయ్ మంజ్రేకర్ తో పాటు ఫ్యాన్స్ కోహ్లీని మిస్ అవుతున్నారు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

కోహ్లీ టెస్ట్ రికార్డ్ అద్భుతం: 

2011లో వెస్టిండీస్ టూర్ లో ఇండియా 269వ టెస్టు ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఈ ఫార్మాట్‌‌‌‌లోఅరంగేట్రం చేసిన విరాట్ 14 ఏండ్ల కెరీర్‌‌లో  పరుగుల మోత మోగించడంతో పాటు తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. కెప్టెన్‌‌‌‌గా టీమిండియాను  జట్టును టెస్టు ర్యాంకింగ్‌‌‌‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. 2018-–19లో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించాడు. అతని నాయకత్వంలో ఇండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. 42 నెలల పాటు ఇండియాను టెస్టుల్లో టాప్ ర్యాంకర్‌‌గా నిలిపాడు. దాంతో టెస్టులో మోస్ట్ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఇండియా కెప్టెన్‌‌‌‌గా మారాడు.  

Also Read :  వికెట్ కీపింగ్ నేర్చుకో.. లేకపోతే టీమిండియాలో చోటు కష్టం

ఓవరాల్‌‌‌‌గా గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్,  స్టీవ్ వా తర్వాత  నాలుగో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌‌‌‌గా నిలిచాడు.  ఇండియా కెప్టెన్‌‌‌‌గా అత్యధికంగా 20 సెంచరీలు కొట్టి మరో రికార్డు సృష్టించాడు. తన నాయకత్వంలో స్వదేశంలో ఆడిన 11 సిరీస్‌ల్లో 11 గెలవడం విశేషం.  అయితే, గత నాలుగేండ్ల నుంచి తను క్రమంగా ఫామ్‌‌‌‌ కోల్పోయాడు. సౌతాఫ్రికాలో సిరీస్‌‌‌‌ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 

37 ఏండ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌‌‌‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్‌‌‌‌) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి.