
న్యూఢిల్లీ: సీనియర్ ఇన్వెస్టర్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ ఐటీ షేర్లపై పాజిటివ్గా ఉన్నారు. ఫెడ్ త్వరలో తన పాలసీ వైఖరీని సులభతరం చేస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్, కోఫోర్జ్ షేర్లపై కన్నేయాలని అన్నారు. ‘ఐటీ షేర్లలో మూడు నెలల కిందటే అవకాశాలు క్రియేట్ అయ్యాయి. హెచ్సీఎల్ టెక్ షేరు రూ.950 దగ్గర, టెక్ మహీంద్రా రూ.1,050 దగ్గర కొనుక్కోవలసింది. ఈ రెండు షేర్లు మరింత పెరుగుతాయి. మా ఐటీ బాస్కెట్లో స్టార్ ప్లేయర్ పెర్సిస్టెంట్.
ఈ మూడు షేర్లపై ఫోకస్ పెట్టాం. వీటికి కోఫోర్జ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో ప్రమోటర్ లేరు. త్వరలో కార్పొరేట్ డెవలప్మెంట్పై వార్తలు వినొచ్చు’ అని సంజీవ్ భాసిన్ వెల్లడించారు. తమ దగ్గర ఉన్న పీఎన్బీ, మారుతి, హెచ్సీఎల్ టెక్, హీరో షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయని చెప్పారు. క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీ విస్తరిస్తుండడంతో ఎస్బీఐ కార్డ్స్ షేర్లను మూడు రోజుల కిందటే కొన్నామని అన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను హోల్డ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేర్ల ధర తక్కువగా ఉందని, ఈ కంపెనీలో గతంలోనే ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. కానీ, ఈ షేరు పెరగాల్సినంత పెరగలేదని, చైర్పర్సన్ మారడంతో ఈ షేరు పెరగొచ్చన్నారు.