‘బీజేపీ గ్రేట్పార్టీ.. పార్టీ పనితీరు నచ్చి సభ్యత్వం తీసుకున్నా. దీనిపై రెండో ఆలోచనకు తావులేదు’ అని హర్యానా సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి చెప్పారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆదివారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీ ఢిల్లీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా మాస్ మెంబర్షిప్ పోగ్రాంలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్చౌహాన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సప్నా చౌదరి మనోజ్ తివారీ తరఫున ప్రచారం చేశారు. దీంతో ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ ప్రచారాన్ని కొట్టిపారేసిన సప్నా చౌదరి.. మనోజ్తనకు మంచి మిత్రుడని, అందుకే ప్రచారంలో పాల్గొన్నానని వివరణ ఇచ్చారు.
