కాకా బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ గుర్తింపు రావడం గర్వకారణం: సరోజా వివేకానంద్

కాకా బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ గుర్తింపు రావడం గర్వకారణం: సరోజా వివేకానంద్

కాకా బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ కు అటానమస్ గుర్తింపు రావడం పట్లా కాలేజ్ యాజమాన్యం  హర్షం వ్యక్తం చేసింది.  ఇన్ని రోజులు ఓయూకి అనుబంధంగా ఉండేది. ఇపుడు అటానమస్ గుర్తింపు ఇస్తూ యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. 

 హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని  కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంలో అటానమస్  గుర్తింపు  రావడం  గర్వకారణమన్నారు కాలేజ్ కరస్పాండెంట్ సరోజా వివేకానంద్. తమ కాలేజీల్లో,  డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సుల్లో చాలా రకాల గోల్డ్ మెడల్స్, స్టేట్ ర్యాంక్స్ వచ్చాయన్నారు. ఆటో డ్రైవర్స్ పిలల్లు, సింగిల్ పేరెంట్ పిల్లలకు తమ కాలేజీలో మంచి ర్యాంక్స్ వస్తున్నాయని చెప్పారు సరోజా వివేక్. త్వరలోనే తమ సంస్థను మంచి యూనివర్సిటీగా చూస్తామని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి  కాలేజీలో 6 వేల మంది స్టూడెంట్స్, 300 మంది స్టాఫ్ పని చేస్తున్నారని చెప్పారు. 

1973లో కాకా ఆశించిన విధంగా బడుగు బలహీన వర్గాల కోసం డోనేషన్ ఫ్రీ క్యాంపస్ లో విద్యను అందించాలనే ఆలోచనతో ఇన్ స్ట్యూషన్  ప్రారంభించారు. ఆ రోజు ఎలా మొదలు పెట్టారో ఇవాళ అలాగే కొనసాగిస్తున్నాం.  ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాకా వెంకట స్వామి చూపించిన మార్గంలోనే మేము నడుస్తున్నాం.80 శాతం మార్కులు వచ్చిన పిల్లలకు స్పాన్సర్షిప్ ఇచ్చి విద్యను అందిస్తున్నం.దీంతో ఎంతో మంది పేద విద్యార్థులకు లాభం జరుగుతోంది. విద్యార్థులకు త్వరలోనే అవసరమైన వసతులు కల్పిస్తాం అని అన్నారు సరోజా వివేకానంద్.