గ్రూప్ 4 ఎగ్జామ్ సెంటర్లో సెల్ఫోన్తో పట్టుబడ్డ అభ్యర్థి

గ్రూప్ 4 ఎగ్జామ్ సెంటర్లో  సెల్ఫోన్తో పట్టుబడ్డ అభ్యర్థి

గ్రూప్ 4 పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతీనగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత అభ్యర్థి దగ్గర సెల్ ఫోన్ ఉన్నట్లు  ఇన్విజిలేటర్లు గమనించారు. దీంతో ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పరీక్షా కేంద్రానికి చేరుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. ఆ తర్వాత మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై కేసు నమోదు చేశారు.