EMI కట్టలేక పంచాయతీ ట్రాక్టర్ అమ్మకానికి పెట్టిన సర్పంచ్

EMI కట్టలేక పంచాయతీ ట్రాక్టర్ అమ్మకానికి పెట్టిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈఎంఐ(EMI)లు కట్టలేక గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను సర్పంచ్ అమ్మకానికి పెట్టారు. గత కొన్ని  నెలలుగా  ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కిస్తీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని  సర్పంచ్ రాధ చెబుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కువానిపల్లెలో ఈ ఘటన జరిగింది. 

తొమ్మిది నెలలుగా గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని సర్పంచ్ రాధ తెలిపారు. నెలనెలా ఠంచనుగా ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బందిపడుతున్నామని.. గత్యంతరం లేకనే సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టామన్నారు.  EMI కట్టలేకనే అమ్మకానికి పెడుతున్నట్లు సోషల్ మీడియాలో పెట్టామని చెప్పారు.   ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని సర్పంచ్ రాధ కోరారు.