బీజేపీ ఎలక్షన్​ అఫైర్స్​ కమిటీ చైర్మన్​గా శశిధర్​ రెడ్డి

బీజేపీ ఎలక్షన్​ అఫైర్స్​ కమిటీ చైర్మన్​గా శశిధర్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలక్షన్​ ఎఫైర్స్​కమిటీని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ చైర్మన్​గా మాజీ మంత్రి మర్రి శశిధర్​ రెడ్డి, కన్వీనర్​గా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ ​కుమార్​ను నియమించారు.

సభ్యులుగా కేతినేని సరళ (కార్పొరేటర్), డాక్టర్​ ప్రేమ్​రాజ్, ఆంటోని రెడ్డి (అడ్వొకేట్), డాక్టర్​ఎం. లక్ష్మణ్, ఈడెల్లి అజయ్​కుమార్, పొన్న వెంకటరమణ, పవన్, భరద్వాజ్​ను ఎంపిక చేశారు. 

ఈ కమిటీ ఎన్నికల సమయంలో ఎదురయ్యే సమస్యలు, ఇతర అంశాలను సీఈవో దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేయాల్సి ఉంటుంది.