కాంగ్రెస్​లోకి సతీష్ మాదిగ .. కండువా కప్పి ఆహ్వానించిన మల్లు రవి

కాంగ్రెస్​లోకి సతీష్ మాదిగ  .. కండువా కప్పి ఆహ్వానించిన మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే కాంగ్రెస్ లో చేరినట్టు సతీష్ మాదిగ తెలిపారు. మాదిగలకు మేలు చేస్తామని బీజేపీ మాయ మాటలు చెబుతోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని మల్లు రవి నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్లు రవి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఆ తర్వాత సతీష్ మాదిగ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టుకు వచ్చిందంటే.. అది కాంగ్రెస్ వల్లనేనని సతీష్ మాదిగ అన్నారు.