Paderu 12th Mile: సత్యం రాజేష్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌.. పాడేరు థియేటర్‌ రిలీజ్ ఎప్పుడంటే?

Paderu 12th Mile: సత్యం రాజేష్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌.. పాడేరు థియేటర్‌ రిలీజ్ ఎప్పుడంటే?

సత్యం రాజేష్ లీడ్‌‌ రోల్‌‌లో రూపొందిన చిత్రం ‘పాడేరు 12వ మైలు’.సుహాన హీరోయిన్‌‌గా నటించగా  శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు.  ఎన్.కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ నిర్మించారు. జూన్ 6న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా  డైరెక్టర్ ఎన్. కె మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సత్యం రాజేష్ కెరీర్‌‌‌‌లో మరో స్పెషల్ మూవీగా నిలుస్తుంది’అని అన్నాడు.

నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదలైన మా మూవీ ప్రమోషనల్ కంటెంట్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని అన్నారు. గడ్డం నవీన్, షేకింగ్ శేషు, ముకేష్ గుప్త ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పీఆర్ సంగీతం అందించాడు.