ఫ్రిడ్జ్ టెంపరేచర్ను మారుస్తున్నారా?

ఫ్రిడ్జ్ టెంపరేచర్ను మారుస్తున్నారా?

సాధారణంగా ఫ్రిడ్జ్​ని వేసవిలోనే ఎక్కువగా వాడతారు. అప్పుడు టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫ్రిడ్జ్​ను తెరుస్తుంటారు. అయితే వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్​తో పెద్దగా పని ఉండదు. అలాంటప్పుడు ఫ్రిడ్జ్‌‌ టెంపరేచర్​ తగ్గించుకోవచ్చు. దాని వల్ల కరెంట్ వాడకం కూడా తగ్గుతుంది. 

కానీ, చాలామంది ఈ సెట్టింగ్స్​ గురించి పట్టించుకోకుండా సంవత్సరమంతా ఒకే టెంపరేచర్​లో ఉంచుతారు. దానివల్ల ఉపయోగం లేదు.. కరెంట్ బిల్ కూడా ఎక్కువే. కాబట్టి ఈ వింటర్ సీజన్​లో రిఫ్రిజరేటర్​ టెంపరేచర్​ను ఇలా సెట్ చేసుకోండి. 

ఫ్రిడ్జ్​​లో టెంపరేచర్​ను కంట్రోల్​ చేయడానికి డయల్ లేదా డిజిటల్ ప్యానెల్ ఉంటుంది. దీన్ని సాధారణంగా 0 నుంచి 5 లేదా 1 నుంచి 7 వరకు సెట్ చేసుకోవచ్చు. వేసవిలో ఎలాగూ చల్లదనం ఎక్కువగా కావాలి కాబట్టి 4 లేదా 5కి సెట్ చేసుకుంటారు. కానీ.. ఇప్పుడు శీతాకాలంలో ఫ్రిడ్జ్​ను 2 లేదా 3కి సెట్ చేసుకుంటే చాలు. ఫ్రీజర్ వింటర్, సమ్మర్​ సీజన్​లలో 18 లేదా 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్​ ఉండాలి. 

అయితే ఫ్రిడ్జ్​లో అన్ని విభాగాల్లో టెంపరేచర్స్ ఒకేలా ఉండవు. కూరగాయల కోసం క్రిస్పర్ డ్రాయర్​ వాడాలి. అది తేమను కంట్రోల్ చేస్తుంది. పై అల్మారాలు, డోర్​ రాక్​లు చల్లగా ఉంటాయి. పాలు, రసం లేదా సాస్​లు వంటి వాటిని అక్కడ స్టోర్ చేయాలి. కింది అల్మారాల్లో కూలింగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మాంసం లేదా మిగిలిపోయిన వాటిని నిల్వ చేయొచ్చు.