బ్యాంకు జాబ్ కోసం చూస్తుంటే.. ఇదే మంచి ఛాన్స్.. నెల జీతం 70 వేలకు పైనే..

బ్యాంకు జాబ్ కోసం చూస్తుంటే.. ఇదే మంచి ఛాన్స్.. నెల జీతం 70 వేలకు పైనే..
  • ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ .. 541 పోస్టులతో పీఓ నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ​ఇండియా(ఎస్​బీఐ) 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులను రెండేండ్ల ప్రొబేషన్ అనంతరం జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-–-I ఉద్యోగంలోకి తీసుకుంటారు. అసాధారణ ప్రతిభ కలిగిన అధికారులు తక్కువ సమయంలోనే టాప్ మేనేజ్​మెంట్ గ్రేడ్​కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్​బీఐలో అత్యున్నత హోదాలో పనిచేసే అవకాశం ప్రొబేషనరీ ఆఫీసర్ ద్వారా లభిస్తుంది. పీఓ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం.

ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్
ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. ప్రిలిమ్స్​లో సాధించిన మార్కులను ఫేజ్–2, ఫేజ్–3 మార్కులతో కలపరు. నోటిఫికేషన్​లో పేర్కొన్న ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్​లైన్​లో ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలకు 30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలకు 30 మార్కులు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.  సెక్షన్స్ వారీగా ఎలాంటి కటాఫ్​ ఉండదు.
 
మెయిన్స్ ఎగ్జామినేషన్ 
 ప్రిలిమ్స్​లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి కేటగిరీలోని  ఖాళీల సంఖ్యను అనుసరించి 10 రెట్ల మందిని మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్​లైన్​లో ఉంటుంది. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ మొత్తం 250 మార్కులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్టులో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్​కూ వేర్వేరుగా సమయం ఉంటుంది. సెక్షన్–Iలో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 60 మార్కులకు 40 ప్రశ్నలు ఇస్తారు. 50 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

సెక్షన్–IIలో డేటా అనాలసిస్ అండ్ ఇంటర్​ప్రిటేషన్ నుంచి 60 మార్కులకు 30 ప్రశ్నలు ఇస్తారు. 45 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. సెక్షన్–IIIలో జనరల్ అవేర్​నెస్/ ఎకానమీ/ బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 60 మార్కులకు 60 ప్రశ్నలు ఇస్తారు. 45 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సెక్షన్–IVలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులకు 40 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 మార్కులకు 170 ప్రశ్నలు ఇస్తారు. మూడు గంటల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.  ప్రతి తప్పుడు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

డిస్క్రిప్టివ్ టెస్ట్
మెయిన్స్ ఎగ్జామినేషన్ పూర్తికాగానే వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సమాధానాలను కంప్యూటర్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పై మూడు ప్రశ్నలు ఇస్తారు. ఈ–మెయిల్స్, రిపోర్ట్స్, పరిస్థితుల విశ్లేషణ, కచ్చితమైన రచన నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ–మెయిల్స్( రెండు ప్రశ్నలు ఇస్తారు. ఒకటి తప్పకుండా రాయాల్సి ఉంటుంది), రిపోర్ట్స్( రెండు ప్రశ్నలు ఇస్తారు ఒకటి తప్పకుండా రాయాల్సి ఉంటుంది), పరిస్థితుల అంచనా లేదా కచ్చితత్వ రచన(రెండు ప్రశ్నల నుంచి ఒకటి రాయాలి) రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్​లో ప్రతి అభ్యర్థి కూడా ప్రతి సెక్షన్(I, II, III, IV అండ్ డిస్క్రిప్టివ్ పేపర్) నుంచి కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీల సంఖ్యను అనుసరించి సెక్షన్ కట్ ఆఫ్​ను ఎస్​బీఐ నిర్ణయిస్తుంది. 

ఫేజ్–III ఎగ్జామినేషన్
మెయిన్స్​ మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.  ఖాళీల సంఖ్యకు మూడు రెట్లు అభ్యర్థులను ఫేజ్–III  కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫేజ్–III ఎగ్జామ్​లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్​సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఫేజ్–  III కోసం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వ్యక్తిత్వ  ప్రొఫైలింగ్ కోసం బ్యాంక్ సైకోమెట్రిక్ ఎగ్జామ్​ను నిర్వహిస్తుంది.  ఆ తర్వాత గ్రూప్ ఎక్సర్​సైజ్ 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు మొత్తం 50 మార్కులకు ఫేజ్–III ఎగ్జామ్ ఉంటుంది.

ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్: భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఆన్​లైన్ పద్ధతిలో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్(పీఈటీ)ని బ్యాంకు ఉచితంగా అందజేస్తుంది. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి కూడా ఆన్​లైన్​లో అప్లై చేసేటప్పుడు పీఈటీ కాలమ్​ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఈటీకి సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్డ్ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా అభ్యర్థులకు ఎస్​బీఐ తెలియజేస్తుంది. 

ఫైనల్ సెలెక్షన్: ప్రతి అభ్యర్థి ఫేజ్–II, ఫేజ్–III ఎగ్జామినేషన్లలో వేర్వేరుగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మెయిన్స్​లో భాగంగా ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్టులో సాధించిన మార్కులను ఫేజ్–III మార్కులకు కలిపి ఫైనల్ మెరిట్ లిస్టును తయారు చేస్తారు.  ప్రిలిమినరీలో సాధించిన మార్కులను ఫైనల్ మెరిట్ లిస్టులో కలపరు. ఫేజ్–II, ఫేజ్–III  మార్కులను నార్మలైజ్డ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీ వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

జాయినింగ్, ట్రైనింగ్, ఉద్యోగం: ప్రొబేషనరీ ఆఫీసర్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆన్ లైన్ కోర్సు ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ పరిజ్ఞానం అందజేస్తారు. ఉద్యోగంలో చేరడానికి ముందే ప్రతి అభ్యర్థి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు ప్రొబేషనరీ ఆఫీసర్ గా తీసుకుంటారు. రెండేండ్లపాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. విజయవంతంగా ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులను జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్–I గా తీసుకుంటారు. 

నోటిఫికేషన్​ 

  • ఎస్​బీఐ ప్రొబేషనరీ పోస్టుల భర్తీ కోసం అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 14.
  • పోస్టుల సంఖ్య: 541
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా అప్లై చేయవచ్చు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో 2025, సెప్టెంబర్ 30 లోపు డిగ్రీ పూర్తయిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 24 
  • లాస్ట్ డేట్: జులై 14.
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ప్రిలిమినరీ ఎగ్జామ్: 2025 జులై/ ఆగస్టు 
  • మెయిన్స్ ఎగ్జామ్: 2025, సెప్టెంబర్ 
  • సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ: 2025, అక్టోబర్/ నవంబర్.
  • పూర్తి వివరాలకు  sbi.co.in వెబ్​సైట్​లో చూడగలరు.