అక్టోబర్‌ 31 వరకూ స్కూళ్ల మూసివేత: మనీశ్ సిసోడియా

అక్టోబర్‌ 31 వరకూ స్కూళ్ల మూసివేత: మనీశ్ సిసోడియా

ఢిల్లీలో ఈ నెల 5 నుంచి స్కూళ్లను తిరిగి తెరవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అన్ లాక్ 5.0లో భాగంగా పాఠశాలలు తిరిగి తెరచుకునేందుకు అనుమతి లభించినా, అక్టోబర్ 31 వరకూ స్కూళ్ల మూసివేత కొనసాగుతుందని.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఈ విషయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పట్లో స్కూళ్లు తెరవద్దని, ఆన్ లైన్ క్లాసులు మాత్రం నిర్వహించుకోవచ్చని అని ట్విట్టర్ ట్వీట్ చేశారు.

స్కూళ్లు తెరచినా, విద్యార్థుల అటెండెన్స్ తప్పనిసరి కాదని, తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అనుమతిని తీసుకున్న తర్వాత మాత్రమే స్కూళ్లకు పిల్లలను అనుమతించాలని కేంద్రం, తన అన్ లాక్ 5.0 మార్గదర్శకాల విడుదల సందర్భంగా స్పష్టం చేసింది. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో స్కూళ్లు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న విషయం ప్రశ్నార్ధకంగా ఉంది.

మార్చిలో లాక్ డౌన్ ను ప్రకటించిన తర్వాత మూతబడిన స్కూళ్లు ఇప్పటివరకూ తెరచుకోలేదు. 9వ తరగతిపై క్లాసుల వారికి మాత్రం కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు తిరిగి తెరచుకున్నాయి.