యాదాద్రి, వెలుగు : సెలవు రోజుల్లోనూ స్కూళ్లు, హాస్టళ్లలో అవసరమైన రిపేర్లను పూర్తి చేయాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు ఆదేశించారు. ఏఏ రిపేర్లు అవసరమో గుర్తించి అంచనాలు రూపొందించాలని సూచించారు. బుధవారం జిల్లాలోని రామన్నపేట హాస్టల్, జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్ను ఆయన సందర్శించారు.
రూమ్స్, బాత్రూముల రిపేర్లను గుర్తించాలని సూచించారు. జనంపల్లి ప్రిన్స్పాల్ ఇంటిమేషన్ లేకుండా గైర్హాజరు కావడంతో సీరియస్ అయ్యారు. అనంతరం ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి స్కూల్స్లో స్టూడెంట్స్ అడ్మిషన్ పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై రివ్యూ నివహించారు. వడ్ల కొనుగోలు స్పీడప్ చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆయన ఆదేశించారు.

