ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు సహకరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించినా…ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రమేష్ కుమార్ ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఎన్నికల కమిషన్ రాసిన లేఖపైనా ప్రభుత్వం స్పందించలేదని, సీఎస్ స్పందన కూడా సరిగా లేదని ఈ పిటిషన్ లో తెలిపారు.
ఎన్నికల విషయంలో తాము ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ముందుకు వెళుతున్నా గానీ, ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా ఏపీ సర్కారుకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
