ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
  • ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
  • సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి

అమరావతి: ఏపీలో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అరగంట విరామం తర్వాత  సాయంత్రం 4 గంటలకు  నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత  ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల పర్యవేక్షణకు ఆయా జిల్లాల్లో ఎన్నికల కమిషన్ పరిశీలకులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు ఎన్నికల పోలింగ్ విధులకు టీచర్లకు డ్యూటీ వేశారు. ఆయా మండల కేంద్రాల్లో మధ్యాహ్నం నుండి పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో 3,328 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా 2,789 సర్పంచ్ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేసిన 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు నాలుగు రోజులపాటు ప్రచారం చేసుకున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చూపించి మరీ ప్రచారం చేసుకున్నారు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో మొదటి దశలో పలు ప్రాంతాల్లో గందరగోళం చెలరేగింది. ఈ విషయాన్ని గుర్తించిన  రెండో విడతలో పోటీ చేసే అభ్యర్థులు తమ గుర్తులను ఓటర్ల వద్దకు తీసుకువెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసుకున్నారు.  బ్యాలెట్ పేపర్లలో పేరు ఉండదని.. కేవలం గుర్తును చూసి మాత్రమే ఓటు వేయాలని.. బ్యాలెట్ పత్రంలో వరుస సంఖ్యలో తమ గుర్తు ఎక్కడ ఉందో చూపించి మరీ ఓటర్లను అభ్యర్థించారు

పోలింగ్ విధులకు గైర్హాజరైన సిబ్బందికి సస్పెన్షన్ ఉత్తర్వులు

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది గైర్హాజరు అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది అనారోగ్య కారణాలతో అనుమతి తీసుకున్నారు. మరికొంత మంది ఎలాంటి అనుమతి తీసుకోకుండా డుమ్మా కొట్టినట్లు తేలింది. దీంతో అల్టర్నేట్ గా ఉన్న వారికి పోలింగ్ బాధ్యతలు అప్పగించారు. అనుమతి తీసుకోకుండా గైర్హాజరైన  పోలింగ్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డుమ్మాకొట్టిన వారి వివరాలను ఆయా మండలాల ఎంపిడిఓలు నుండి వెంటనే తెప్పించుకుని సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు.

For More News..

వీడియో: బర్త్ డే పార్టీకి రానన్నాడని.. కారుతో గుద్ది చంపాడు

లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా..

మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు

స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు