హైదరాబాద్, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సెక్రటేరియెట్ సిబ్బంది విషెస్ చెప్పారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నివాసానికి వెళ్లి.. ఆయనకు సీఎం రేవంత్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు, సెక్రటేరియెట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి,పుష్పగుచ్ఛాలు అందజేశారు.
