ముంబైలో మే 17 వరకు సెక్షన్ 144

ముంబైలో మే 17 వరకు సెక్షన్ 144

కరోనాను అరికట్టేందుకు ముంబై ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించింది. వైద్యం కోసం తప్ప వేరే ఇతర పనుల కోసం రోడ్లపైకి రావద్దని హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే… 6 నెలల పాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. రాత్రి  వేళల్లో  కేవలం మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ముంబై మహానగరం ఈ వైరస్ దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీని ప్రభావం తగ్గడం లేదు. కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అక్కడ 144 సెక్షన్ విధించింది.