- సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్
ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి ఏమీ చేయలేదని, ఆ విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసని బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ఎంపీ కిషన్రెడ్డి ఎక్కడ? అని జనం అడుగుతున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో అర్థం అవుతుందన్నారు. సోమవారం రాత్రి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి పద్మారావుగౌడ్కవాడిగూడ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన తనకు పార్లమెంట్సభ్యునిగా అవకాశం ఇస్తే.. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో గళమెత్తుతానన్నారు. సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు ఎదురులేదని, బీజేపీ, కాంగ్రెస్పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయని విమర్శించారు. ఇప్పటివకు ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముఠా జైసింహ, బి.శ్రీనివాస్ రెడ్డి, మాధవ్, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.