కాంగ్రెస్​తోనే అన్ని వర్గాల అభివృద్ధి : దానం నాగేందర్

కాంగ్రెస్​తోనే అన్ని వర్గాల అభివృద్ధి : దానం నాగేందర్

అంబర్​పేట, వెలుగు: కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని సికింద్రాబాద్ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. సోమవారం అంబర్​పేట చే నెంబర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు రోహిత్ అధ్యక్షతన యువభేరి సభ నిర్వహించారు. సీనియర్ నేత వీహెచ్, కాంగ్రెస్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ సురభి సిద్వేదితో కలిసి దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసదుద్దీన్​ఒవైసీ తెలంగాణలో పోటీ చేసి, బీజేపీ గెలిపించే ప్రయత్నం చేయొద్దని సూచించారు. తెలంగాణలోని మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.