
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆఫీసర్ గ్రేడ్– ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 110. ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్).
విభాగాలు: జనరల్ 56, లీగల్ 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 22, రీసెర్చ్ అసోసియేట్ 04, ఆఫీషియల్ లాంగ్వేజ్ 03, ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) 02, ఇంజినీరింగ్ (సివిల్) 03.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, బి.టెక్/ బీఈ, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. 1995, అక్టోబర్ 01 తర్వాత జన్మించిన వారై ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000.
సెలెక్షన్ ప్రాసెస్: సెలెక్షన్ మూడు దశల్లో ఉంటుంది. ఫెజ్–1, ఫెజ్–2లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఫేజ్–3లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు sebi.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.