పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. శ్రీనగర్ లోని జకురా ప్రాంతంలో పోలీసులకు, లష్కర్ ఏ తొయిబా, టీఆర్ఎఫ్ గ్రూపులకు చెందిన టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అందులో ఒకర్ని ఇక్బాల్ హజంగా గుర్తించారు. వీరి నుంచి రెండు పిస్టళ్లు, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజీపీ తెలిపారు. రీసెంట్ గా అనంత్ నాగ్ లోని  హసన్ పొరాలో చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ అలీ మహ్మద్ కేసులో హజం హస్తం ఉందన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

సినిమాలకు గుడ్బై.. ఇకపై నటించను

జస్టిన్ లాంగర్ అనూహ్య నిర్ణయం

విశ్లేషణ: శూద్రులు నిలబెడుతున్న.. రామానుజ కీర్తి