సన్ నెక్ట్స్లో సీతా పయనం

సన్ నెక్ట్స్లో సీతా పయనం

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శక నిర్మాతగా  ఆయన కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌‌‌‌గా పరిచయం చేస్తూ  రూపొందించిన చిత్రం ‘సీతా పయనం’. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు  నిరంజన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  

ఫిబ్రవరి 14న థియేటర్స్‌‌‌‌లో విడుదలైన ఈ చిత్రం ఉగాది రోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందని టీమ్ తెలియజేసింది.  బంధాల విలువ చాటి చెప్పే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, ఉగాది నుంచి ఓటీటీకి రావడం ఆనందంగా ఉందని  అర్జున్ అన్నారు.   ధృవ సర్జా,  సత్యరాజ్,  ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.