బొజ్జు పటేల్ను సన్మానించిన సీతక్క

బొజ్జు పటేల్ను సన్మానించిన సీతక్క

ఖానాపూర్, వెలుగు: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఖానాపూర్ ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్​కు ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. బొజ్జు పటేల్​ హైదరాబాద్ లోని ప్రజా భవనంలో మంగళవారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా ఆమె బొజ్జు పటేల్​ను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కష్టపడాలని సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేందుకు కృషి చేయాలన్నారు. పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆడె గజేందర్ తదితరులున్నారు.