కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నెలలో కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో  గుర్గావ్ లోని ప్రముఖ మేదాంత ఆస్పత్రిలో చేరి  ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలోకి తరలించారు. అక్టోబర్‌ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని డాక్టర్లు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తలెత్తిందని చెప్పారు. మరోవైపు అ‍హ్మద్‌ పటేల్‌ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన  చెందుతున్నారు.