ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలపై విచారణ చేయించాలి : రాచకొండ విఘ్నేశ్

ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలపై విచారణ చేయించాలి : రాచకొండ విఘ్నేశ్

బోధన్​,వెలుగు:  బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని ఎస్‌ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ డిమాండ్ చేశారు.  బుధవారం బోధన్​లో ఎస్​ఎఫ్​ఐ ఆఫీసులో  ప్రెస్​మీట్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   సీఎం  రేవంత్​ రెడ్డికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పై  లేదన్నారు.  ట్రిపుల్​ఐటీ విద్యార్థులకు సరైన  అవగాహన కల్పించకపోవడంతో ఏటా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.     కాంగ్రెస్​ పాలన  మొదలై మూడు నెలలు గడుస్తున్నా  విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోచనీయమన్నారు. 

 బోధన్​లో జవహర్​ నవోదయ విద్యాలయాన్ని, ఇంజనీరింగ్​ కాలేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.   కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై  విద్యాశాఖ  అధికారులు చర్యలు  తీసుకోవాలని డిమాండ్ ​చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో డివిజన్​ నాయకులు ప్రశాంత్​, రాజేశ్​, విష్ణు తదితరులు పాల్గొన్నారు.