డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికల్లో గెలవాలె : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికల్లో గెలవాలె :  పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

షాద్​నగర్, వెలుగు: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బు, మద్యం పంచకుండా గెలవాలని షాద్ నగర్ సెగ్మెంట్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. జబర్దస్త్ ఫేమ్ కొమురం అలియాస్ కొమురక్క హాజరై తన మాటలతో ఉత్సాహపరిచాడు. 

అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మద్యం, డబ్బు, బిర్యానీ ఆశ చూపిస్తారని.. వాటికి లొంగిపోయి ఓటేయొద్దని కోరారు. ప్రధాన పార్టీలకు మేనిఫెస్టోలు ప్రకటించడం తప్ప స్థానిక సమస్యలపై అవగాహన ఉండదన్నారు. తనను గెలిపిస్తే కొత్తూరును పీడిస్తున్న కాలుష్యం సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.