పంజాగుట్ట, వెలుగు: బీర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహేల్ అలియాస్ సోహైల్ ఐడెంటిటీ పరేడ్ కు డుమ్మా కొట్టాడు. నిరుడు మద్యం మత్తులో ప్రజాభవన్ వద్ద డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో నిందితుడిగా ఉన్న రాహేల్.. కోర్టు నిబంధనల ప్రకారం సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఐడెంటిటీ పరేడ్ కు హాజరు కావాల్సి ఉంది. కానీ, పరేడ్ కు రాకుండా కోర్టు నిబంధనలను అతడు ధిక్కారించాడని పంజాగుట్ట డివిజన్ ఏసీపీ మోహన్ కుమార్ తెలిపారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో ఏ చర్యలు తీసుకోవాలో కోర్టే తెలుపుతుందని ఆయన చెప్పారు.
