
బ్లాక్బస్టర్ "సంజు" సినిమా తర్వాత రణబీర్ కపూర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'షంషేరా'. ఈ చిత్రం ట్రైలర్ లో తన అద్భుతమైన నటనాతో రణబీర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో రణబీర్ తండ్రి, కొడుకులుగా రెండు పాత్రల్లో నటించాడు. రణబీర్ ఒకే చిత్రంలో రెండు పాత్రలు పోషించడం ఇదే మొదటిసారి. 'షంషేరా' కథ కల్పిత నగరమైన కాజాలో జరుగుతుంది. ఇక్కడ ఒక యోధులకు చెందిన కొంత మంది ఖైదు చేయబడి, బానిసలుగా జనరల్ షుద్ సింగ్ చేత హింసించబడుతుంటారు. ఇది బానిసగా మారిన వ్యక్తి నాయకుడిగా ఎదిగే కథ. అతను తన వాళ్ళ స్వేచ్ఛ, గౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతాడు. అతని పేరు షంషేరా.
హై-ఆక్టేన్, అడ్రినలిన్-పంపింగ్ ఎంటర్టైనర్గా1800లలో భారతదేశంలో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. రణబీర్ కపూర్ గతంలో ఎన్నడూ చేయని పాత్రను ఈ చిత్రంలో చేశారు. ఈ చిత్రంలో రణబీర్కు శత్రువుగా సంజయ్ దత్ నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టెయినర్ను ఆదిత్య చోప్రా నిర్మించారు. జూలై 22, 2022న హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.