సీఎం రేవంత్ రెడ్డి సెక్రెటరీగా షానవాజ్ ఖాసీం

సీఎం రేవంత్ రెడ్డి సెక్రెటరీగా షానవాజ్ ఖాసీం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా షానవాజ్ ఖాసీం నియమితులయ్యారు.  ఈ మేరకు సీఎస్ శాంతికుమారి  2023 డిసెంబర్ 12న  ఉత్తర్వులు జారీ చేశారు.  2003 ఐపీఎస్ కు  చెందిన షానవాజ్ ఇప్పటివరకు హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు.  

మరోవైపు తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇక నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్‌ శాండిల్యను ప్రభుత్వం  నియమించింది.  ఇప్పటి వరకు సైబరాబాద్‌, రాచకొండ సీపీలుగా వ్యవహరించిన స్టీఫెన్‌ రవీంద్ర, దేవేంద్రసింగ్‌ చౌహాన్‌లను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.