జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా శంకర్ యాదవ్

జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా శంకర్ యాదవ్

జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ సారి బీజేపీ నాయకత్వం బీసీ వర్గానికి చెందిన శంకర్ యాదవ్ కు అవకామిచ్చింది. ఆయనతో పాటు పాటు ముగ్గురు డిప్యూటీ లీడర్లు, నలుగురు సెక్రటరీలు, ఇద్దరు విప్ లు, ముగ్గురు అధికార ప్రతినిధులు, ఆఫీస్ సెక్రటరీ, కోశాధికారిలను కూడా బీజేపీ నియమించింది. గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 47డివిజన్లు గెలుచుకున్న బీజేపీ... రెండేళ్లుగా ఫ్లోర్ లీడర్ లేకుండానే బీజేపీ కార్పొరేటర్లు నెట్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ నియామకానికి సంబంధించిన జాబితాను రిలీజ్ చేశారు.

ఫ్లోర్ లీడర్

శంకర్ యాదవ్ (బేగంబజార్)

డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్లు

వి.రాధా ధీరజ్ రెడ్డి (ఆర్కే పురం)
కొప్పుల నర్సింహా రెడ్డి ( మన్సూరాబాద్)
డా.సురేఖ ఓం ప్రకాష్ (గన్ ఫౌండ్రీ)

సెక్రటరీలు 

కేతినేని సరళ (అమీర్ పేట)
కె. చేతన హరీష్ (హబ్సీగూడ)
కె.రవిచారి (రాంనగర్)
వై.అమ-ృత (నల్లకుంట)

విప్ లు

తోకల శ్రీనివాస్ రెడ్డి (మైలార్ దేవులపల్లి)
బొక్క భాగ్యలక్ష్మి (మూసారాంబాగ్)

అధికార ప్రతినిధులు

వంగా మధుసూధన్ రెడ్డి (చంపాపేట)
కొడిచర్ల మహేంద్ర కుమార్ (మూసాపేట)
ఆకుల శ్రీవాణి (సరూర్ నగర్)

ఆఫీస్ ఇన్ ఛార్జ్ 

శ్రవణ్ (మల్కాజ్ గిరి)

కోశాధికారి

సి. రాజ్యలక్ష్మి (వినాయక్ నగర్)