బెంగళూరులో విపక్షాల సెకండ్​ మీటింగ్​

బెంగళూరులో విపక్షాల సెకండ్​ మీటింగ్​
  • ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​

ముంబై: ప్రతిపక్ష నేతల రెండో సమావేశం వచ్చే నెల 13, 14 వ తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్నామని ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​ గురువారం తెలిపారు.  పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కలవరం మొదలైందని పవార్​ అన్నారు. కాగా, బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​ అధ్యక్షతన ప్రతిపక్షాల తొలి సమావేశం పాట్నాలో జరిగింది. 

ఈక్రమంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్షాల రెండో సమావేశం జులైలో జరుగుతుందని ప్రకటించారు. హిమాచల్​ ప్రదేశ్​లోని సిమ్లాలో సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ సమావేశం సిమ్లాలో కాదని బెంగళూరులో నిర్వహించనున్నట్లు శరద్​ పవార్​ వెల్లడించారు.