- ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
ముంబై: ప్రతిపక్ష నేతల రెండో సమావేశం వచ్చే నెల 13, 14 వ తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్నామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గురువారం తెలిపారు. పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కలవరం మొదలైందని పవార్ అన్నారు. కాగా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాల తొలి సమావేశం పాట్నాలో జరిగింది.
ఈక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్షాల రెండో సమావేశం జులైలో జరుగుతుందని ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ సమావేశం సిమ్లాలో కాదని బెంగళూరులో నిర్వహించనున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు.