నష్టపోయిన రైతును ఆదుకున్న శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ముల

నష్టపోయిన రైతును ఆదుకున్న శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ముల

మునగాల, వెలుగు: భూమి అమ్మగా వచ్చిన డబ్బు ఫైర్​ యాక్సిడెంట్​లో కాలిపోవడంతో కష్టాల్లో చిక్కుకున్న రైతుకు సినీ డైరెక్టర్ ​శేఖర్ కమ్ముల రూ.లక్ష సాయం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన లక్ష్మయ్య భూమి అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో దాచాడు. ఇటీవల ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి ఆ డబ్బు కాలిపోయింది. ఈ విషయం వీ6, వెలుగు పేపర్​లో వచ్చిన కథనాల ద్వారా తెలుసుకున్న శేఖర్ కమ్ముల రూ.లక్ష సాయం అందించారు. మదర్ థెరిసా సోషల్ సర్వీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొట్టిపర్తి శ్రీనివాస్ తన బృందంతో లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, రూ.500 అందించారు.