హైదరాబాద్ :
ఇండియన్ ప్రీమియర్ లీ గ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడుతున్న ఓపెనర్శి ఖర్ ధవన్ ఆ జట్టు కి గుడ్ బై చెప్పేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ కి ముందు జరిగిన వేలంలో తనని తక్కు వ ధరకే ‘రైట్ టు మ్యాచ్ (ఆర్ టీఎం)’ ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ దక్కించుకుం దని గుర్రుగా ఉన్న ధవన్ యాజమాన్యం తోనూ గొడవపడినట్లు వార్తలు వచ్చాయి.బెంగళూరు వేదికగా జనవరిలో జరిగిన వేలంలో శి ఖర్ ధవన్ ని దక్కించు కునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆఖరి వరకూ పోటీపడినా.. రూ. 5.2 కోట్లకి ఆర్ టీఎం ద్వారా హైదరాబాద్ చేజిక్కించుకుం ది. కానీ.. తనకి ఇంకా మంచి ధర వచ్చేదని భావిం చిన ధవన్.. ఫ్రాంఛైజీ వద్ద అసహనం వ్యక్తం చేసి.. 2019 ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ కి ఆడనని తెగేసి చెప్పేశాడట. దీం తో ధవన్ అయిష్టతని పరిగణలోకి తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ కి అతడ్ని బదిలీ చేసి.. ఆ జట్టు నుంచి విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు), నదీమ్ (3.2 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.55 లక్షలు)లను తీసుకుం ది. ఈ ఏడాది వేలం ప్రకారం ఈ ముగ్ గు రి ధర రూ. 6.95 కోట్లు కాగా.. శిఖర్ ధవన్ ధరని మినహాయిం చి మిగిలి న సొమ్ము ని ఢిల్లీ డేర్ డెవిల్స్ కి హైదరాబాద్ ఫ్రాంఛైజీ చెల్లిం చాల్సి ఉంటుంది.