మే 1 నుంచి షిర్డీ బంద్​..  దర్శనం ఉంటుందా..లేదా..?

మే 1 నుంచి షిర్డీ   బంద్​..  దర్శనం ఉంటుందా..లేదా..?

 మహారాష్ట్రలోని  మతపరమైన పర్యాటక ప్రదేశం షిర్డీలో  మే 1 నుంచి నిరవధికంగా బంద్​ చేయనున్నారు. .  సాయిబాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు నిరసనగా ఆలయ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఆలయ భద్రతా అవసరాలను నిర్వహించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అవసరం లేదని సాయిబాబా ఆలయ నిర్వాహకులు విశ్వసిస్తున్నారు.

ఏటా మిలియన్ల మంది సందర్శన

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ పట్టణంలోని సాయిబాబా ఆలయం అత్యంత ముఖ్యమైన ఆలయం. ఈ చిన్న పట్టణం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, ప్రపంచవ్యాప్తంగా అన్నీ మతాల వారు  ఏటా మిలియన్ల మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రాథమిక ఆలయం అహ్మద్‌నగర్-మన్మాడ్ రహదారిపై ఉంది.   దీనిని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. 2018లో షిర్డీ విమానాశ్రయం భద్రతా వ్యవహారాలను CISFకి అప్పగించారు.  ఇప్పుడు  సాయిబాబా ఆలయాన్ని రక్షించడానికి ప్రభుత్వం కేంద్ర  బలగాలను కేటాయించాలని యోచిస్తోంది.

సమ్మెతో ట్రస్ట్​ కు సంబంధం లేదు

ఆలయానికి ప్రణాళికాబద్ధమైన CISF భద్రతను ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్న వివిధ సంస్థలు .. ఇక్కడ అన్ని మార్కెట్‌లు, రవాణాదారులు, వాణిజ్య మరియు ఆతిథ్య పరిశ్రమల మూసివేతకు పిలుపునిచ్చాయి. పట్టణ ప్రజల  సమ్మెతో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (SSST)కి ఎలాంటి సంబంధం లేదని ఆలయ అధికారి ఒకరు కి తెలిపారు. కానీ సాయిబాబా ఆలయంలో కార్యకలాపాలన్నీ  యథావిధిగా పనిచేస్తాయి... CISF బలగాలు ఎప్పుడు మోహరిస్తాయో తెలియదని..  ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ భద్రత కల్పిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.   మెటల్ డిటెక్టర్లు, CCTVలు , ఇతర భద్రతా ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయని ట్రస్ట్​ అధికారులు తెలిపారు.  ప్రధాన సాయిబాబా ఆలయం 4.5 ఎకరాలలో విస్తరించి... SSST కార్యకలాపాలు దాదాపు 350 ఎకరాలలో ఉన్నాయి.  అయినప్పటికీ CISF పర్యవేక్షణ ఆలయ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది.

CISF బలగాలు అవసరం లేదు 

షిర్డీ పట్టణంలో దాదాపు 25,000 మంది జనాభా ఉన్నారు.  సాయిబాబా ఆలయాన్ని ప్రతిరోజూ 50,000 మంది భక్తులు సందర్శిస్తారు,  CISF అనేది ప్రధాన పబ్లిక్ ఇన్‌స్టాలేషన్‌ల భద్రతను నిర్వహించడానికి మాతరమే అని షిర్డీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.   షిర్డీ వంటి మతపరమైన పుణ్యక్షేత్రం  ప్రత్యేక భద్రతా సవాళ్లను నిర్వహించడానికి  నైపుణ్యం లేని ప్రత్యేక దళం  అవసరం లేదని  పట్టణ ప్రజలు వాదించారు. ఈ  షట్‌డౌన్ స్థానిక ఆర్థిక వ్యవస్థపై  పెద్ద దెబ్బ పడుతుంది.  ఇది దాని మనుగడ కోసం పూర్తిగా మతపరమైన పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది.

ఏదేమైనప్పటికీ, ఆలయ నిర్వాహకులు  ప్రభుత్వ  నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.   మతపరమైన పుణ్యక్షేత్రం కాబట్టి  విలక్షణమైన భద్రతా పర్వవేక్షణకు  కేంద్ర  బలగాలు అవసరం లేదని ఆలయ నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆలయ ప్రాంగణ నిర్వహణను పర్యవేక్షిస్తుంది, ఇందులో ఉచిత భోజనం, వసతి మరియు ఇతర సౌకర్యాలు,  స్వచ్ఛంద పాఠశాలలు , కళాశాలలను నిర్వహించడం వంటివి ఉంటాయి.