మెహబూబా ముఫ్తీని అయోధ్యకు తీసుకురాగలరా?

మెహబూబా ముఫ్తీని అయోధ్యకు తీసుకురాగలరా?

రామ జన్మభూమి అయోధ్యకు బీజేపీ గతంలో పొత్తు పెట్టుకున్న పీడీపీ నేత, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని తీసుకురాగలరా అని సవాలు విసిరారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. శనివారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు. మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే మార్చి 7న ఆయోధ్య సందర్శనకు వెళ్తారని తెలిపారు సంజయ్ రౌత్. అయితే ఈ పర్యటనపై బీజేపీ కౌంటర్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్ధవ్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అయోధ్య సందర్శనకు తీసుకెళ్లాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. అయితే ముందు బీజేపీ గతంలో పొత్తు పెట్టుకుని కశ్మీర్ సీఎంను చేసిన పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని వారి అయోధ్య పర్యటనలో వెంటబెట్టుకుని తీసుకురాగలరా అంటూ బీజేపీ నేతలకు సంజయ్ రౌత్ సవాలు చేశారు.