ముషీరాబాద్, వెలుగు: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. యువతతోనే దేశ భవిత ముడిపడి ఉందని, డ్రగ్స్ నుంచి వారిని కాపాడటం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం అనుబంధంగా బీసీ శివాజీ ఆర్మీని ఏర్పాటు చేసి, దాని రాష్ట్ర అధ్యక్షుడిగా సీహెచ్ ప్రవీణ్ కుమార్ను నియమించారు. సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన ఆయనకు ర్యాగ అరుణ్ కుమార్తో కలిసి నియామక పత్రం అందజేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ, గంజాయి నిర్మూలనే శివాజీ ఆర్మీ ప్రధాన లక్ష్యమన్నారు.
