Pawan Kalyan: నేడు విజయవాడలో ‘ఓజీ’.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌తో పవన్ కళ్యాణ్

Pawan Kalyan: నేడు విజయవాడలో ‘ఓజీ’.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌తో పవన్ కళ్యాణ్

బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌తో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. ఆయన కమిటైన చిత్రాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ‘ఓజీ’ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రీసెంట్‌‌‌‌గా ముంబైలో కొన్ని యాక్షన్ సీన్స్‌‌‌‌ను చిత్రీకరించారు.

నేడు గురువారం (JUNE5) నుంచి ‘ఓజీ’ కొత్త షెడ్యూల్‌‌‌‌ విజయవాడలో మొదలవుతోంది. దీనికోసం తాడేపల్లిలో స్పెషల్ సెట్‌‌‌‌ను వేశారట. ఈ షెడ్యూల్‌‌‌‌లో పవన్‌‌‌‌తో పాటు ఇతర నటీనటులంతా జాయిన్ కానున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌తో దాదాపు టాకీ పార్ట్ పూర్తికానుందని తెలుస్తోంది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్టులో  ప్రియాంక మోహన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌గా,  అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే  ప్రకటించారు. మరోవైపు  పవన్ హీరోగా  హరీష్ శంకర్ డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్‌‌‌‌సింగ్‌‌‌‌’ జూన్ సెకండ్ వీక్‌‌‌‌ నుంచి సెట్స్‌‌‌‌కు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే  జూన్ 12న విడుదలవ్వాల్సిన ‘హరిహర వీరమల్లు’వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. జులై 4న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ రిలీజ్ డేట్‌‌‌‌పై అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రావాల్సి ఉంది.