మరో మూడు నెలలు ఉల్లితో లొల్లే

మరో మూడు నెలలు ఉల్లితో లొల్లే

మన రాష్ట్రంలో 70% పంట నష్టం
ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో 50 శాతం క్రాప్ డామేజ్
సగానికి పడిపోయిన దిగుమతి

హైదరాబాద్‌‌, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు ఉల్లిపంట భారీగా దెబ్బతింది. మన రాష్ట్రంలో వానాకాలం పంట పూర్తిగా పోగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌, కర్నాటక, గుజరాత్‌‌తో పాటు ఏపీలోని కర్నూల్‌‌ జిల్లాలో 50% క్రాప్‌‌ లాస్ అయ్యింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన ఉల్లి దిగుమతి పడిపోయింది. దీంతో ఉల్లి రేట్లపై ప్రభావం పడుతోంది. క్రాప్‌‌ తీసేసి మళ్లీ వేస్తుండడంతో మరో 3 నెలల పాటు ఉల్లి ధరలు తగ్గే పరిస్థితి లేదని మార్కెటింగ్‌‌ వర్గాలు చెబుతున్నాయి.

లోకల్‌‌ పంటకు ఎఫెక్ట్‌‌

మన రాష్ట్రంలోని తాండూరు, నారాయణఖేడ్‌‌, కొల్లాపూర్‌‌, అలంపూర్‌‌, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఈ  సీజన్‌‌లో ఉల్లి దాదాపు దెబ్బతిన్నది. పంట 30% చేతికందిందని, ఉన్న పంటను స్థానికంగానే అమ్ముకున్నట్టు రైతులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో పండే ఉల్లి  అక్టోబర్, నవంబర్  నెలల్లోనే వస్తుంది. అయితే చాలావరకు పంట నష్టపోవడంతో ఉల్లి దిగుబడిపై ఎఫెక్ట్‌‌ పడింది. ఒక వైపు వినియోగదారులు కొనుక్కునేందుకు ఇబ్బందులు పడుతుంటే..  పంట అమ్ముకునే రైతుకు ఫలితం దక్కడం లేదని, దళారులే బాగుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మార్కెట్‌‌కు ఉల్లి లారీలు తగ్గినయ్‌‌

మహారాష్ట్రలోని నాసిక్‌‌,  ఏపీలోని కర్నూల్‌‌, మన రాష్ట్రంలోని గద్వాల, మహబూబ్‌‌నగర్‌‌ ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతులు వస్తుంటాయి. రోజుకు 70 నుంచి 100 లారీల వరకు వచ్చే ఉల్లి గురువారం 35 లారీల లోడ్లు మాత్రమే వచ్చాయి.  అదీ నాసిక్, కర్నూల్‌‌ నుంచి 5,567 క్వింటాళ్ల పాత ఉల్లిగడ్డలే.

నాఫెడ్‌‌కు 500 టన్నుల ఇండెంట్‌‌

దిగుమతులు తగ్గి ఉల్లి ధరలు పెరగడంతో రాష్ట్ర మార్కెటింగ్‌‌ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌‌ను ఆశ్రయించింది. 500 టన్నుల ఇండెంట్‌‌ పెట్టగా మొదటి విడతగా 100 టన్నులను సప్లయ్ చేసింది. దీంతో హైదరాబాద్‌‌ సిటీలోని 11 రైతు బజార్లలో ఒక్కో వినియోగదారునికి కిలో రూ.35 చొప్పున అందిస్తున్నట్టు మార్కెటింగ్‌‌ శాఖ డైరెక్టర్‌‌ లక్ష్మీబాయి తెలిపారు.

ఐదు రెట్లు పెరిగిన రేటు

హైదరాబాద్‌‌లోని మలక్‌‌పేట్‌‌ హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌లో ఉల్లి గరిష్ట ధర రూ.65 ఉండగా.. బహిరంగ మార్కెట్‌‌లో కిలో రూ.80కి పైగా అమ్ముతున్నారు.  గత రెండు నెలల కిందట ధరలతో  పోలిస్తే ఐదారు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారు. డిమాండ్‌‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్‌‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఆగస్టులో ఉల్లికి రేటు లేక హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌లో రూ.5 నుంచి రూ.9లోపే అమ్మారు.  సెప్టెంబరులో హోల్‌‌సేల్ లో రూ.25 నుంచి 35 వరకు విక్రయించారు. అక్టోబర్‌‌లో రూ.65 నుంచి రూ.100 వరకు పలుకుతోంది.

For More News..

దళితులకు ఇచ్చేందుకు మూడెకరాలు లేవా?

10 వేల సాయం పంచుక తింటున్నరు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్​ పాసైతే చాలు ఇంజనీరింగ్‌లో చేరొచ్చు

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తే రూ. 29 లక్షల జీతం