Shraddha Kapoor: ఇన్‌స్టాలో ప్రధాని మోడీని దాటేసిన స్టార్ హీరోయిన్..నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?

Shraddha Kapoor: ఇన్‌స్టాలో ప్రధాని మోడీని దాటేసిన స్టార్ హీరోయిన్..నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?

బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) అరుదైన మైల్ స్టోన్ దక్కించుకుంది. లేటెస్ట్ స్త్రీ2 మూవీ హిట్‌తో తన క్రేజ్‌ని దేశవ్యాప్తంగా పెంచుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో ప్రధాని నరేంద్ర మోడీని (Narendra Modi) అధిగమించింది. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇన్‌స్టాలో 91.3 మిలియన్ మంది ఫాలో అవుతుండగా..తాజాగా 91.5 మిలియన్ల ఫాలోయర్లతో శ్రద్ధ కపూర్ అధిగమించారు.

ముఖ్యంగా, కపూర్ తన పెంపుడు కుక్కతో ఫోటోలు పంచుకోవడం లేదా ఆహారం పట్ల తనకున్న ప్రేమను చూపడం వంటి వాటి ద్వారా సోషల్ మీడియాలో తన “అసలైన గుర్తింపు” దక్కించుకుంది. అలాగే తాజా స్త్రీ 2 సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తుండటంతో ఫాలోయర్ల సంఖ్య మరింత రెట్టింపు అయింది.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీని అత్యధికంగా 271 మిలియన్ మంది ఫాలో అవుతుండగా..ప్రియాంక చోప్రాని 91.8 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. త్వరలో ప్రియాంక చోప్రాని దాటేయడానికి సిద్ధంగా ఉంది శ్రద్ద కపూర్. వీరి తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్‌కు 85.1 మిలియన్ల ఫాలోవర్లు, దీపికా పదుకొణెకు 79.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఇకపోతే కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ (26.7M), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(27.6M) మరియు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా ప్రపంచ నాయకులతో సహా ప్రముఖ రాజకీయ నాయకుల కంటే ప్రధాని మోదీ చాలా ముందున్నారు.

రాజ్ కుమార్ రావ్‌తో కలిసి శ్రద్ధ కపూర్ నటించిన లేటెస్ట్ ఫిలిం స్త్రీ2. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. 2018లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకి ఇది సీక్వెల్.స్త్రీ పార్ట్ 1 రూ.100 కోట్లు సాధించింది. దీంతో స్త్రీ 2కు మరింత క్రేజీ ఏర్పడింది.