ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో తారక్ తో సినిమాలు తీసేందుకు భారత్ తో పాటు హాలీవుడ్ లోని దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాలో తారక్ సరసన మరో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఆమె ఎవరంటే..
సాహోతో టాలీవుడ్ కు దగ్గరైన శ్రద్దా కపూర్. సాహో సినిమాలో ప్రభాస్తో రొమాన్స్చేసిన శ్రద్దా కపూర్.. మరోసారి ఈ సినిమాతో టాలీవుడ్లో మెరవనుందని టాక్. యంగ్ టైగర్తో శ్రద్దా జోడీ ఎలా ఉంటుందోనని.. ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మొదలైంది. అలాగే ఈ చిత్రం ద్వారా అలనాటి అందాల సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చే అవకాశాలున్నాయి.